ఈ మద్య టాలీవుడ్ లో కొత్త నటీనటులు ఒక్క సినిమాతో లక్కీ ఛాన్స్ కొట్టేస్తూ స్టార్ హీరోలు, హీరోయిన్ల సరసన నిలబడుతున్నారు. ఈ మద్య మూడు సినిమాలతోనే స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి లాంటి ఒక్క సినిమాతోనే అటు దర్శకుడు, ఇటు హీరో ఓ రేంజ్ కి ఎదిగిన విషయం తెలిసిందే. ఆ మద్య ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడు విజయ్ భూపతి, హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ కి ఎక్కడ లేని ఇమేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా లో హీరో కార్తికేయ ఓ కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రకారుపై చెరగని ముద్ర వేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టింది.
ఈ సినిమాలో తన బోల్డ్ నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది ఈ కుర్ర హీరోయిన్. ఈ సినిమా తర్వాత పాయల్ కు పలు సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. తాజాగా ఈ అమ్మడికి క్రేజీ ప్రాజెక్టు దక్కినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో పాయల్ కు ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. ఓ వైపు అందాలు ఆరబోయటంతో పాటు..మరో వైపు నటనతోనూ ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో వరస ఆఫర్లు వస్తున్నాయని టాక్. ఓ సినిమాలో కన్నుగీటడం ద్వారా మళయాళ కుర్ర హీరోయిన్ ప్రియా వారియర్ కు కూడా అలా వరస పెట్టి సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా సహజ నటి జయసుధ పాత్రలో పాయల్ రాజ్ పుత్ ను తీసుకోవాలని క్రిష్ యోచిస్తున్నట్లు సమాచారం. పాయల్ ముఖకవళికలు, హావభావాలు జయసుధకు సరిగ్గా సరిపోతాయని భావించిన సినిమా నిర్మాతలు, దర్శకుడు పాయల్ ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక తెలుగు చలన చిత్ర సీమలో ఎన్టీఆర్, జయసుధ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. డ్రైవర్ రాముడు’, ‘గజదొంగ’, ‘మహా పురుషుడు’, ‘అడవి రాముడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగమైన ‘కథానాయకుడు’ సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేసేందుకు నిర్మాతలు చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.