శంకర్, రజిని కాంబోలో ప్రెస్టిజియస్ గా తెరకెక్కిన మూవీ 2.ఓ. రోబో సీక్వల్ గా 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. రజినికి ప్రతి నాయకుడిగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటుస్తున్నాడు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాకు అకడెమీ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించారు.


తెలుగు సెన్సార్ ఈమధ్యనే పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇక్కడ సెన్సార్ సభ్యుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ లో దమ్ము చూపిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల భారీ బిజినెస్ చేస్తున్న 2.ఓ మూవీ డిజిటల్ రైట్స్ లో కూడా దుమ్మురేపుతుంది.


సినిమా అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కలిపి 120 కోట్లు రాబట్టిందట. ఇక డిజిటల్ రైట్స్ మరో 60 కోట్లు తెచ్చి పెట్టిందట. అంటే కేవలం శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో 180 కోట్లు రాబట్టిందన్నమాట. ఈ లెక్కన సినిమా హిట్ టాక్ సొతం చేసుకుంటే కనుక ఆ లెక్క వేరేలా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.


హాలీవుడ్ స్టాండర్డ్స్ తో వస్తున్న 2.ఓ మూవీ చివరి 20 నిమిషాలు అద్భుతంగా ఉంటుందట. శంకర్ క్రియేటివిటీకి అందరు షాక్ అవడం ఖాయం అంటున్నారు. రజిని, అక్షయ్ ల మధ్య వచ్చే సీన్స్ కూడా ఆసక్తికరంగా ఉంటాయట. మరి బాహుబలి బీట్ చేసేందుకు వస్తున్న 2.ఓ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: