సౌత్ ఇండియన్ టాలెంటెడ్ డైరక్టర్స్ లో ఒకరైన శంకర్ అంటే ఇండియన్ వైజ్ గా సూపర్ క్రేజ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ తో కూడిన సినిమాలు చేస్తుంటాడు. మొదటి సినిమా జెంటిల్ మెన్ సినిమాతోనే దర్శకుడిగా తన ప్రతిభ చాటిన శంకర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.


లేటెస్ట్ గా రజినికాంత్ హీరోగా రోబో సీక్వల్ గా 2.ఓ సినిమా చేశాడు శంకర్. రోబో సీక్వల్ గా కథ రాసుకున్నప్పుడు ముందు శంకర్ రజినికాంత్ తో కాకుండా వేరే హీరోతో చేయాలని అనుకున్నాడట. ఆ హీరో ఎవరో తెలియదు కాని అతను మాత్రం ఈ సినిమాకు నో అని చెప్పాడట. విక్రం తో ఐ సినిమా ఫ్లాప్ అయ్యాక శంకర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది.


ఆ సినిమా చేసింది దర్శకుడు శంకరేనా అన్న విధంగా సినిమా ఫలితం అందుకుంది. అయితే దాన్ని చూసో లేక మరేమో కాని రోబో సీక్వల్ సినిమాకు తమిళ స్టార్ హీరో వద్దనేశాడట. రోబో సీక్వల్ గా రజిని కాకుండా వేరే హీరో అయితే యాక్సెప్ట్ చేయరనుకున్నాడో ఏమో శంకర్ సినిమాకు సరీ అని చెప్పాడు.


ఈ విషయాన్ని 2.ఓ ప్రమోషన్స్ లో చూచాయగా చెప్పాడు శంకర్. 2.ఓ మరోసారి సౌత్ సినిమా సత్తా చాటుతుందని. కచ్చితంగా ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు సినిమాలో ఉంటాయని చెబుతున్నారు. రజీనితో పాటుగా అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ గా నటించడం విశేషం. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన 2.ఓకు రెహమాన్ మ్యూజిక్ కూడా కొంత ప్రత్యేకత వచ్చేలా చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: