టాలీవుడ్ లో సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ ఏది చేసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది.  ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు హిట్, ఫ్టాప్ తో సంబంధం లేకుండా సెన్సేషన్ క్రియేట్ అయ్యేలా చేస్తూ వచ్చాడు.  కమర్షియల్ హిట్ కాకపోయినా..కలెక్షన్లు రాకపోయినా..తన సినిమాలకు మాత్రం విపరీతమైన పబ్లిసిటి వచ్చేలా చేస్తుంటారు.  తాజాగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కిన రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ భైరవ గీత. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమాను 2.ఓ కు పోటిగా ఈ నెల 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు. 
Image result for bhairava geetha postphone
తన సినిమా పై ఫోకస్ రావాలని శంకర్, రజినీకాంత్ నటించిన ‘2.ఒ’ చిన్న పిల్లల సినిమా అంటూ కామెంట్ చేసి భైరవ గీతకు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకువచ్చాడు. దీనిపై ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు రాంగోపాల్ వర్మ.  మరోవైపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’షూటింగ్ బిజీలో ఉన్న రాంగోపాల్ వర్మ ‘భైరవగీత’ ప్రమోషన్ బిజీలో ఉన్నారు.  వాస్తవానికి ‘భైరవగీత’ఈ నెల 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు వర్మ.
Image result for bhairava geetha postphone
కానీ ప్రస్తుతం ‘2.ఒ’సినిమాకు వస్తున్న హైప్ చూసి కంగారు పడ్డట్టున్నారు. చివరి నిమిషంలో వర్మ వెనుకడుగు వేశాడు. సెన్సార్ సమస్యలతో పాటు సాంకేతిక కారణాల వల్ల భైరవ గీత సినిమా రిలీజ్‌ వాయిదా వేసినట్టుగా వెల్లడించారు. వారం ఆలస్యం డిసెంబర్‌ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. సిద్ధార్థ్‌ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో ధనుంజయ్‌, ఇర్రామోర్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: