నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని విక్రం కుమార్ తో సినిమా షురూ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ విక్రం, నాని కాంబో సినిమా నిర్మిస్తుంది.


విక్రం కుమార్ నాని కోసం క్రేజీ సబ్జెక్ట్ రాశాడట. సినిమాలో విలన్ గా కోలీవుడ్ హీరో తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న సిద్ధార్థ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. నాని, సిద్ధార్థ్ మంచి స్నేహితులు వారిద్దరు కలిసి నటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీ తర్వాత సినిమాను కన్ఫాం చేశాడు నాని.


సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో నాని సినిమా చేస్తున్నాడట. పటాస్, సుపీం, రాజా ది గ్రేట్ సినిమాలతో వరుసగా 3 సినిమాలను హిట్లు అందుకున్న అనీల్ రావిపుడి ప్రస్తుతం ఎఫ్-2 సినిమా చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది.


ఇక ఆ తర్వాత అనీల్ రావిపుడి నానితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. నాచురల్ స్టార్ నానితో మాస్ అండ్ కామెడీ పల్స్ పట్టేసిన అనీల్ రావిపుడి ఎలాంటి సినిమా చేస్తాడో అని ఆడియెన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని క్రియేటివ్ కమర్షియన్స్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు నిర్మిస్తారని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: