టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘ధృవ’సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’సినిమాలో నటించాడు. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. 1985 ప్రాంతంలో ఉన్న గ్రామీణ పరిస్థితులు, రాజకీయాలు, ప్రేమ ఈ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఇందులో చిట్టి బాబు సౌండ్ ఇంజనీరు (చెవిటి పాత్రలో) నటించి అందరి మనన్నలు పొందాడు. ఎప్పుడూ స్టైల్ గా కనిపించే రాంచరణ్ ఈ సినిమాలో లుంగీతోనే ఎక్కువగా కనిపించాడు. ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది.
ప్రస్తుతం మాస్ దర్శకులు బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్, కైరా అద్వాని జంటగా 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. ఈ సినిమాను నుంచి వచ్చిన ఫస్టులుక్ .. టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఫస్టు సాంగ్ ను కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేకుండా చాలా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తూ వచ్చారు. ఇక టీజర్ రిలీజ్ చేసిన తర్వాత సినిమాపై సోషల్ మీడియాలో అప్ డేట్ చేయడం మొదలు పెట్టారు.
సోమవారం రోజున ఈ సినిమా నుంచి ఫస్టు సాంగ్ ను రిలీజ్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ రోజున ఎన్ని గంటలకు సాంగ్ ను రిలీజ్ చేసేది చెప్పనున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పాటు మంచి యాక్షన్ తరహాలో రూపొందబోతుందట. అయితే రిలీజ్ చేయబోచే సాంగ్ బంధాలు .. అనుబంధాలు కుటుంబాన్ని ఎంత బలంగా నిలబెడతాయనే సందేశంతో ఈ కథ కొనసాగుతుంది. ఆ పాయింట్ కి సంబంధించి చిత్రీకరించిన పాటనే ఫస్టు సాంగ్ గా వదలనున్నారని తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.