భాగమతి సినిమా తర్వాత స్వీటీ అనుష్క ఏ సినిమా చేస్తుంది అన్న విషయంపై అఫిషియల్ గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు. ఓ పక్క కోనా వెంకట్ నిర్మాణ సారధ్యంలో సీక్రెట్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా దానిపై ఎలాంటి న్యూస్ బయటకు రావడం లేదు. మాధవన్ తో అనుష్క రొమాన్స్ చేస్తుందని అంటున్నారు. 


ఇదిలాఉంటే ఇప్పుడు అనుష్క మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతుందని అంటున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఓ క్రేజ్ వచ్చేలా చేసిన అనుష్క క్రియేటివ్ డైరక్టర్ చంద్రశేఖర్ ఏలేటి డైరక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారట. ఇప్పటికే చంద్రశేఖర్ ఏలేటి అనుష్కకు కథ చెప్పడం ఆమె ఓకే చెప్పడం అంతా జరిగిందట.


సైజ్ జీరో కోసం కాస్త బొద్దుగా మారిన అనుష్క ఇప్పుడు ఎవరికి కనిపించకుండా తన బరువు తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉందట. ఆస్ట్రేలియా వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకుంటుందని అన్నారు. ఏది ఏమైనా మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై అనుష్క అదరగొట్టేందుకు రెడీ అవుతుంది. కమర్షియల్ సినిమాలను చేసేందుకు సై అంటుందట.


కచ్చితంగా ఇది అనుష్క ఫ్యాన్స్ కు సంతోషపడే వార్తే. అయితే కొంతమంది మాత్రం దాదాపు అనుష్క కెరియర్ ముగిసినట్టే చేసినా రెండు మూడు కంటే ఎక్కువ చేయదని ఇంట్లో ఆల్రెడీ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. మరి తామే స్వయంగా ఎనౌన్స్ చేస్తే తప్ప అనుష్క పై వస్తున్న ఏ న్యూస్ నమ్మాలన్నది చెప్పలేం.



మరింత సమాచారం తెలుసుకోండి: