టాలీవుడ్, కోలీవుడ్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించారు విశ్వనటులు కమల్ హాసన్. కమల్ తర్వాత ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన హీరో విక్రమ్ అని చెప్పొచ్చు. ఆ మద్య విక్రమ్ నటించిన ‘ఐ’సినిమా కోసం ఏకంగా తన శరీరంతోనే ప్రయోగాలు చేసినట్లు స్వయంగా దర్శకులు శంకర్ తెలిపారు. ఈ మద్య స్వామి 2 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ ఓ బారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో దర్శకుడు శంకర్ విక్రమ్ హీరోగా వంద కోట్ల బడ్జెట్ తో 'ఐ' సినిమాను రూపొందించారు.
ఆ మద్య విక్రమ్ ప్రధాన పాత్రధారిగా 'మహావీర్ కర్ణ' అనే తమిళ సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే అంతా అనుకున్నారు. తాజాగా ఈ సినిమా తిరువనంతపురం.. అనంతపద్మనాభ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఆర్ ఎస్ విమల్ దర్శకత్వంలో భారీ పౌరాణిక చిత్రం రూపొందనుంది. దానికి 'మహావీర్ కర్ణ' అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. రూ.300 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మించబోతున్నారట.
త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారు. ముందుగా ఈ సినిమాను మలయాళ నటుడు పృధ్వీరాజ్ హీరోగా అరవై కోట్లలో తీయాలని అనుకున్నారు. కానీ విక్రమ్ చేతికి ప్రాజెక్ట్ రావడంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది. ఈ సినిమాకు టెక్నీషియన్స్ గా ప్రముఖ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ త్రోన్స్ కి పని చేసిన వారిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. క్వాలిటీ పరంగా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించనున్నారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దాదాపు 10 భాషల్లో డబ్ చేసి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.