అక్కినేని నాగార్జున నట వారసులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు హిట్టు కోసం సతమతమవుతున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య హిట్ సినిమా కథ కోసం బాగా ప్రయత్నిస్తున్నాడట. అందులో భాగంగా లేటెస్ట్ గా బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ను కలిసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. తనకు సూట్ అయ్యే ఓ అద్భుతమైన కథను రాయమని విజయేంద్ర ప్రసాద్ కు చెప్పాడట నాగ చైతన్య. 


ఈ ఇయర్ నాగ చైతన్య చేసిన శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి రెండు సినిమాలు నిరాశపరచాయి. మారుతి డైరక్షన్ లో వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు కాస్త బెటర్ అనిపించినా నష్టాలు తప్పలేదు. ఇక చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన సవ్యసాహి ఎన్నో భారీ అంచనాలతో వచ్చి నిరాశపరచింది. మైత్రి మూవీ మేకర్స్ కు మొదటి షాక్ ఇచ్చిన సినిమా సవ్యసాచి.


శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం మూడు వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ నిర్మాతలు కెరియర్ లో మొదటి ఫ్లాప్ ఫేస్ చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన రవితేజ అమర్ అక్బర్ ఆంటొని కూడా మైత్రి మూవీ మేకర్స్ కు షాక్ ఇచ్చింది. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. నాగ చైతన్య విజయేంద్ర ప్రసాద్ ను కలిసి ఓ మంచి కథ సిద్ధం చేయమన్నాడట.


ప్రస్తుతం చైతు, సమంత కలిసి మజిలి సినిమా చేస్తున్నారు. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కోనా వెంకట్ నిర్మిస్తున్నారు. ఈమధ్యనే వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2019 ఫిబ్రవరిలో రిలీజ్ ఉంటుందట. మరి ఈ మజిలి అయినా చైతుకి హిట్ ఇస్తుందా అన్నది చూడాలి. పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంతలు కలిసి చేస్తున్న ఈ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: