బాహుబలికి ముందు టాలీవుడ్ లో డైరక్టర్ బ్రాండ్ గా ఉన్న రాజమౌళి ఇప్పుడు సౌత్ సినిమాల్లోనే తనంటే ఏంతో ప్రూవ్ చేసుకున్నాడు. రాజమౌళి రాజముద్రకు ఉండే సత్తా ఏంటో బాహుబలి సినిమాతో ప్రూవ్ అయ్యింది. భారతీయ సిని చరిత్రలో బాహుబలి సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. 


అందుకే రాజమౌళి అంటే ఓ బ్రాండ్ గా మారాడు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో క్రేజీ మల్టీస్టారర్ ప్లానింగ్ లో ఉన్నాడు రాజమౌళి. ఈ సినిమా ఎనౌన్స్ చేసిన నాటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలాఉంటే రాజమౌళి సపోర్ట్ తో భారీ సినిమాలు ప్రేక్షకుల్లోకి వెళ్లేలా ప్రయత్నాలు జరుగుతునాయి. కన్నడలో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కె.జి.ఎఫ్. యువ హీరో యశ్ హీరోగా వస్తున్న ఈ మూవీ టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచాయి.


తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద అంచనాలను మరిత పెంచేలా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎస్.ఎస్. రాజమౌళిని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు. తెలుగులో కె.జి.ఎఫ్ ను వారాహి చలన చిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అందుకే రాజమౌళితో ఈ సినిమాకు తెలుగులో క్రేజ్ వచ్చేలా చేస్తున్నారు. డిసెంబర్ 9 సాయంత్రం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి గెస్ట్ గా అటెండ్ అవుతున్నాడు. 


ఇప్పటికే ట్రైలర్ పై తన ప్రశంసలు కురిపించిన రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి ఏం మాట్లాడుతాడో అని ఎక్సైటింగ్ గా ఉన్నారు ప్రేక్షకులు. కే.జి.ఎఫ్ చాప్టర్ 1 సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా యష్ తో పాటుగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా గోల్డ్ మైన్ నేపథ్యంలో తెరకెక్కించారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: