బెల్లంకొండ సురేష్ తనయుడిగా అల్లుడు శీను సినిమాతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా నుండి కవచం వరకు కమర్షియల్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. సినిమాలైతే చేస్తున్నాడు కాని వాటికి తగినట్టు ఫలితాన్ని అందుకోవడంలో మాత్రం వెనుక పడ్డాడు శ్రీనివాస్. రీసెంట్ గా సాక్ష్యంతో రిలీజ్ ముందు హంగామా చేసినా ఆఫ్టర్ రిలీజ్ అంత సందడి చేయలేదు.


ఇక లేటెస్ట్ గా అతను హీరోగా మామిళ్ల శ్రీనివాస్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కవచం. కాజల్ అగర్వల్, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోస్ రిపోర్ట్ ప్రకారం సినిమా మళ్లీ బెల్లంకొండ బాబుకి దెబ్బేసిందని అంటున్నారు. దర్శకుడు మామిళ్ల శ్రీనివాస్ కథ బాగున్నా దానికి తగినట్టు కథనం రాసుకోలేదని అంటున్నారు. పవర్ ఫుల్ పొలీస్ అయిన హీరో కిడ్నాప్ గ్యాంగ్ ను ఎలా పట్టుకున్నాడన్నది సినిమా కథ. 


కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ పెయిర్ కు మంచి మార్కులే పడినట్టు తెలుస్తున్నా.. మెహ్రీన్ కౌర్ మాత్రం అంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించలేదని తెలుస్తుంది. తమన్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదట. అల్లుడు శీను నుండి కవచం వరకు భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ మాత్రం కొట్టలేదు.


మనవాడి బ్యాడ్ లక్ ఏంటంటే ఎంచుకున్న కథలు బాగానే ఉంటున్నా వాటికి తగినట్టుగా స్క్రీన్ ప్లే లేకపోవడం వల్లే సినిమాలు నిరాశపరుస్తున్నాయి. కవచంతో పాటుగా తేజ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమాకు సీత అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. మరి బెల్లంకొండ బాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న కవచం కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. మరి తేజ సినిమా అయినా అతనికి హిట్ ఇస్తుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: