మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ సినిమాగా సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ నటిస్తున్నారు.


ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస విజయాలను అందుకుంటున్న కొరటాల శివ చిరు కోసం అద్భుతమైన కథ రాసుకున్నాడట. అయితే ఈమధ్య కొరటాల శివ, చిరు సినిమా క్యాన్సిల్ అయ్యిందని.. దర్శకుడు కొరటాల శివ మహేష్ తో సినిమాకు రెడీ అవుతున్నాడని వార్తలు వచ్చాయి.


అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. కొరటాల శివ చిరంజీవికి జోడీగా నయనతారని హీరోయిన్ గా మాట్లాడుతున్నారట. దాదాపు ఆమె కన్ ఫాం అయినట్టే తెలుస్తుంది. మరి సినిమా ఉంటుందా లేదా అన్న కన్ ఫ్యూజన్ క్లియర్ అయినట్టే లెక్క. సైరా సినిమా తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా ఈ సినిమా చేస్తాడట చిరంజీవి.


ఈ మూవీ కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లో ఉంటుందని తెలుస్తుంది. 2019 మొదట్లో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో చిరంజీవి సినిమా ఉంటుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఆ సినిమా వస్తుందట. సైరా సినిమా మాత్రం సమ్మర్ రిలీజ్ అనుకోగా ఇప్పుడు ఆగష్టుకి వస్తుందని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: