జబర్ధస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించారు హాట్ యాంకర్లు అనసూయ, రష్మి. ఆ మద్య రష్మి గౌతమ్ వెండితెరపై కూడా మెరిసిపోయింది. వరుసగా సినిమా ఛాన్సులు తక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా పలు సినిమాల్లో చాలా బోల్డ్ గా నటించింది. కానీ పాపం ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు..దాంతో ఆఫర్లు తగ్గాయి. ఇప్పుడు అదృష్టం అనసూయ తలుపు తట్టింది..వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఈ రోజుల్లో హీరోయిన్లతో సమానంగా యాంకర్లకు కూడా ఇమేజ్ ఉంది. ముఖ్యంగా షాప్ ఓపెనింగ్లకు హీరోయిన్లకు లక్షలకు లక్షలు ఇచ్చి పిలిచినట్లే.. యాంకర్లను కూడా పిలుస్తుంటారు.
ఈ మద్య అనసూయ, రష్మిలను కూడా కొన్ని ఓపెనింగ్స్ కి ముఖ్య అతిధిలుగా పిలుస్తున్నారు. డిసెంబర్ 9న తిరుపతిలో జరగనున్న ఓ ఈవెంట్లో ఈమె పాల్గొంటుందంటూ కొందరు హోర్డింగులు ఏర్పాటు చేశారు. దాంతో ఈ ఫోటోపై రష్మి ట్విటర్లో సమాధానం ఇచ్చింది.ఈ ఈవెంట్ గురించి తనకు తెలియనే తెలియదని.. ఎందుకు ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నారో తెలియదని.. అసలు ఆ కార్యక్రమం కోసం ఎవరూ తనను సంప్రదించలేదని ట్విట్ చేసింది.
దాంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యక్తి రష్మికి రిప్లై ఇచ్చాడు.ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మేం రష్మికి అడ్వాన్స్ కూడా ఇచ్చాం. ఆమె రావడానికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని ఖండిస్తున్నారు. నేను ఆమె మేనేజర్కు డబ్బులు పంపా.. ఆధారాలు కూడా ఉన్నాయి చూడండి. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా’ అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు పంపాడు. దాంతో రష్మి కూడా ఆ ఈవెంట్ నిర్వాహకుడికి రిప్లై ఇచ్చింది. మాట్లాడేముందు నిజానిజాలు తెలుసుకోవాలని.. ఆయన చేసే వ్యాఖ్యలు అబద్ధాలని రుజువవుతాయని అన్నారు.
ఒకవేళ వాళ్లు చట్టబద్ధమైన చర్యలు తీసుకున్నా కూడా నష్టం వాళ్లకే అని తెలిపింది. ఒకవేళ వాళ్లు కోర్టుకు వెళ్తాం అనుకుంటే వెళ్లొచ్చని చెప్పింది రష్మి. కాగా ఈ విషయంలో మరో వ్యక్తి కల్పించుకొని రష్మి అలాంటి వ్యక్తి కాదని..గతంలో తాము చేసిన ఈవెంట్స్ కి వచ్చిందని..మెను తప్పు పట్టడం లేదని చెప్పాడాయన. దాంతో అతడికి రష్మి ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి ఇప్పుడు రష్మి గౌతమ్ మాత్రం వెంటనే తన ఫ్లెక్సీలను తొలగించాలని కోరింది. మరి ఈ ఇష్యూ ఎక్కడ ముగుస్తుందో చూడాలి.