రంగస్థలం తర్వాత రాం చరణ్ నటిస్తున్న క్రేజీ మూవీ వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను అందించే బోయపాటి శ్రీను ఈ సినిమాను మరింత ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నాడట.


ఇక ఈ మూవీలో ఇంటర్వల్ ఫైట్ అదిరిపోయేలా ఉంటుందట. 500 జూనియర్ ఆర్టిస్టులు, 100 ఫైటర్స్ తో చరణ్ తో అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట బోయపాటి శ్రీను. మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఈ ఫైట్ సీన్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ ఒక్క ఫైట్ చాలు సినిమా హిట్ అవడానికి అంటున్నారు.


రాం చరణ్ కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న వినయ విధేయ రామ సినిమాలో కోలీవుడ్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు నటిస్తున్నారు. ధ్రువ నుండి తన పంథా మార్చిన రాం చరణ్ రంగస్థలంతో నాన్ బాహుబలి రికార్డులన్ని తిరగరాశాడు. వివిఆర్ హంగామా కూడా బాగానే ఉండేట్టు కనిపిస్తుంది.


2019 సంక్రాంతికి రిలీజ్ అవనున్న చరణ్ వినయ విధేయ రామ క్రేజీ మూవీగా మారనుంది. అయితే సంక్రాంతి బరిలో బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి భాగంతో పాటుగా వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఎఫ్-2లు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు సినిమాల్లో ఏది సూపర్ హిట్ అవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: