ఇప్పటి వరకు భారతీయ చలన చిత్ర రంగంలతో స్టార్ డైరెక్టర్ శంకర్ తీసిన సినిమాలన్న ఘన విజయాన్ని అందుకున్నారు.  ఎప్పటికప్పుడు తన సినిమాల్లో ఏదో ఒక మంచి మెసేజ్ అందిస్తున్న విషయం తెలిసిందే.  జెంటిల్ మెన్ నుంచి మొన్నటి 2.0 వరకు ఆయన తీసిన ప్రతి సినిమాల్లో ప్రజలకు మెజేజ్ తో పాటు ఎంట్ర టైన్ మెంట్ అందిస్తున్నారు.   రోబో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో 2.0 మరో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. 

ఈ సినిమాలో సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షి జాతి అంతరించిపోతుందని మెజేజ్ అందించారు శంకర్.  ఇక తమిళనాట రజనీకాంత్, కమలహాసన్ తిరుగులేని హీరోలు అన్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు రాజకీయాలతో పాటు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.  ప్రస్తుతం రజినీకాంతో తో శంకర్ తీసిన 2.0 భారీ బడ్జెట్ తో తీసిన సినిమా అదే రేంజ్ లో కలెక్షన్లు రాబడుతున్నారు. 

ఇక కమల్ కెరియర్లో గర్వించదగిన సినిమాగా 'భారతీయుడు'ను నిలిపిన శంకర్, ఆ సినిమాకి సీక్వెల్ ను సిద్ధం చేసే పనిలో వున్నాడు.  ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసుకున్న ఆయన, ఒక ముఖ్యమైన పాత్ర కోసం వెన్నెల కిషోర్ ను ఎంపిక చేసుకున్నాడు.  అంతే కాదు మరో ముఖ్యమైన పాత్రల్లో  శింబు,దుల్కర్ సల్మాన్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడిగా అనిరుథ్ కి అవకాశం లభించింది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: