బాలీవుడ్ లోకి మక్డీ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్వేతాబసు ప్రసాద్ తర్వాత టాలీవుడ్ లో తెలుగులో కొత్త బంగారు లోకం, కళవర్ కింగ్ సహా పలు సినిమాల్లో శ్వేత నటించింది. మక్డీ సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకుంది శ్వేతాబసు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేశ్ బాబుల చెల్లెలు పాత్ర ఈమెకే దక్కాల్సిందట. ఆ పాత్ర దక్కి ఉంటే శ్వేత ఇండస్ట్రీలో ఆ తరహా క్యారెక్టర్స్ తో సెటిలయిపోయేది. అయితే ఆ అవకాశం మరొకరికి దక్కింది. ఆ తర్వాత శ్వేత దక్షిణాదిన నిలదొక్కుకోలేకపోయింది.
హీరోయిన్ గా మంచి ఫామ్ లోకి వస్తున్న సమయంలో ఆమెపై వ్యభిచార నేరం మోపబడింది. ఆ తర్వాత ఈ కేసు కొట్టి పడేశారు. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన శ్వేతా బసు.. పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. శ్వేతా బసు గత కొంత కాలంగా ఫిల్మ్మేకర్ రోహిత్ మిట్టల్ల డేటింగ్ లో ఉంది. వీరు వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
శ్వేతా బసు ప్రసాద్, రోహిత్ మిట్టల్ల వివాహం గురువారం రాత్రి పుణెలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. బెంగాలీ సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకలో పింక్ కలర్ సిల్క్ సారీలో శ్వేతా బసు మెరిసిపోయారు. అంతకు ముందు జరిగిన పెళ్లి వేడుకల్లో శ్వేతా బసు, రోహిత్ మిట్టల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు డ్యాన్సులతో సందడి చేశారు.
బెంగాలీ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో పింక్ కలర్ సిల్క్ చీరలో శ్వేతా బసు మెరిసిపోయారు. కాగా, ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫొటోలను శ్వేతా బసు ప్రసాద్ ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఆమె భర్త రోహిత్ కూడా ‘ఇక అయిపోయింది’ అని తన పెళ్లి ఫొటోను పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.