మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.  గ్రామీణ నేపథ్యంలో .. కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు ప్రధానంగా ఈ కథ సాగనుంది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్దపీట వేస్తూ దర్శకుడు బోయపాటి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్, ఫస్ట్‌సాంగ్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.


తాజాగా సినిమాలోని రెండో సాంగ్ ‘‘తస్సాదియ్యా..’’ లిరికల్ వీడియో విడుదల చేశారు. రోమియో జూలియట్ మళ్లీ పుట్టినట్టు ఉంటదంటా మన జట్టు .. వాళ్ల కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు   మన లవ్ స్టోరీ హిట్టు .." అంటూ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట కొనసాగుతోంది. 'మోనలిసా నవ్వు .. సన్నజాజి పువ్వు ఒక్కటైతే నువ్వు' .. 'వేడివేడి లావా స్వీటు పాలకోవ ఒక్కటైతే నువ్వు' అనే పదప్రయోగాలు బాగున్నాయి.  ఈ పాట 4 నిమిషాల 25 సెకనుల నిడివితో సాగుతుంది..అంతే కాదు ఫాస్ట్ బీట్‌తో మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది.


ఈ వీడియోలో చెర్రీ, కియారా లుక్స్, డాన్స్ మెగా అభిమానులను కనువిందు చేస్తున్నాయి.  శ్రీమణి సాహిత్యం,జస్ ప్రీత్మ,నసి ఆలాపన దేవీ శ్రీ బాణీలు ఉషారెత్తిస్తున్నాయి. మొత్తానికి ఈ సాంగ్ ద్వారా సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు రెట్టింపు చేశారని చెప్పుకోవచ్చు.  


ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను.. మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా బోయపాటి అన్ని రకాలుగా సినిమా తీర్చిదిద్దుతున్నారట. అంతే కాదు ఈ సినిమాలో తమిళ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ సీనియర్ తారాగణం నటించబోతున్నారు.  ఈ సినిమా  సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: