యువ హీరోల్లో కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్ లేటెస్ట్ గా పడి పడి లేచే మనసు సినిమాతో వస్తున్నాడు. ఈ శుక్రవారం ఆ సినిమా వస్తుంది. శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హను రాఘవపుడి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచాయి.


సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ గా పడి పడి లేచే మనసు సినిమా 22.80 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అంటే 23 కోట్లు రాబడితే ఈ సినిమా హిట్ జాబితాలో నిలుస్తుంది.


శర్వానంద్ మహానుభావుడు మూవీ ఫుల్ రన్ లో 23 కోట్లు తెచ్చింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆ రేంజ్ లో చేయడం విశేషం. శర్వా, సాయి పల్లవిల లవ్ స్టోరీ హైలెట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. సెన్సార్ నుండి మంచి టాక్ తెచ్చుకోగా శర్వానంద్ కు ఈ సినిమా సూపర్ హిట్ ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు.


ఇక ఏరియాల వారిగా ఈ సినిమా బిజినెస్ డీటైల్స్ ఎలా ఉన్నాయంటే.. నైజాంలో 6.30 కోట్లు బిజినెస్ చేయగ.. సీడెడ్ లో  3 కోట్లు రాబట్టింది. ఇక ఏపి మొత్తం మీద 9 కోట్లు బిజినెస్ చేసిన శర్వానంద్ సినిమా ఓవర్సీస్ లో 3.50 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 1 కోటి బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గ 22.80 కోట్లు బిజినెస్ తో బాక్సాఫీస్ రేసులో దిగుతున్నాడు శర్వానంద్.   



మరింత సమాచారం తెలుసుకోండి: