ఎన్టీఆర్ ఈ మూడు అక్షరాలూ చాలు వెండితెరను వెన్నెల చేయడానికి, ఎన్టీఆర్ అంటేనే ఓ ప్రభంజనం. ఆయన పేరుకు అంతటి సమ్మోహన శక్తి ఉంది. మరి అదే ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తే అది కూడా ఓ చరిత్ర కావడం విశేషమే మరి. ఇపుడు అదే జరుగుతోంది. నిన్న రాత్రి అతిరధ మహారధుల మధ్యన విడుదల చేసిన ఎన్టీఆర్ బయోపిక్   ట్రైలర్. ఇపుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.


విడుదలైన కొద్దిసేపటికే ఒక  మిలియన్‌కి పైగా వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్.. ఇప్పటివరకు 3 మిలియన్ల వ్యూస్ దాటేసి పరుగులు పెడుతోంది. ఈ స్పీడ్ చూస్తూంటే మరిన్ని రికార్డులు ఈ ట్రైలర్ సొంతం చేసుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ ట్రైలర్ లో క్రిష్ చెప్పాల్సిన విషయాన్ని చెప్పీ చెప్పకుండా అటు వ్యక్తిగతం, ఇటు సినీ, రాజకీయ జీవితాలను అలా టచ్ చేస్తూ చేసిన ప్రయోగానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.


సినిమా ఎలా ఉంటుందో మచ్చుకు ఒక మెతుకు అన్నట్లుగా క్రిష్ చూపించారు. ఇక ఎన్టీఆర్ గా బాలయ్య ఒదిగిపోయారని కూడా టాక్ నడుస్తోంది. ముఖ్యంగా యవ్వనదశలోనూ, రాజకీయాల్లోనూ అన్న గారి రూపాన్ని బాలయ్య అలా దించేశారని అంటున్నారు. ఇక ట్రైలర్‌లో ‘‘ధన బలమైతే బలుపులో కనిపిస్తుంది.. కానీ ఇది జన బలం.. ఒక్క పిలుపులో వినిపిస్తుంది’’ అనే డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. ఈ డైలాగ్ కోసం ట్రైలర్‌ని పదే పదే రిపీట్ చేసి చూస్తున్నారు జనం. మొత్తానికి  ఎన్టీఆర్ ట్రైలర్ అంచనాలను బాగారే రీచ్ అయిందని మాట గట్టిగా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: