తమిళ హీరో ధనుష్ నటించిన మారి 2 తెలుగు, తమిళ భాషల్లో రీలీజ్ అయ్యింది.  తెలుగు లో పెద్దగా హిట్ టాక్ రాకపోయినా తమిళ నాట మాత్రం దుమ్మురేపుతుంది.  గతంలో తెలుగు లో మారి సినిమా మంచి విజయం అందుకున్నా..ఈ సినిమా సీక్వెల్ మాత్రం ఆశించిన స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేదు.  తమిళ నాట మొదటి నుంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ధనుష్ ఈసారి మారి 2 తో మరో విజయం అందుకున్నారు.  ఈ సినిమాలో ధనుష్ సరసన సాయి పల్లవి నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు అయినప్పటికీ ఆ ఇమేజ్ ఏమాత్రం ఉపయోగించుకోకుండా తన స్వశక్తితో పైకి వస్తున్నాడు. 


కేవలం నటుడిగానే కాకుండా దర్శక, నిర్మాణ రంగంలో కూడా తన సత్తా చాటమే కాదు సింగర్ గా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.  గతంలో ధనుష్ పాడిన కొలవెరి పాట ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది.  తాజాగా ధనుష్ ఈ రోజున తన తదుపరి చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను వదిలాడు. ధనుశ్ తదుపరి చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ధనుశ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందువలన ఈ ఇద్దరూ కలిసి మరోమారు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.  


తమిళంలో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే యువకథానాయకులలో ధనుశ్ ముందు వరుసలో కనిపిస్తాడు. కథాకథనాలపై ధనుశ్ కి మంచి పట్టువుంది. మంచి కథ ఉంటే వెంటనే ఓకే చేస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు.  ఈ సినిమాకి 'అసురన్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. వి.క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: