తెలుగు చల చిత్ర సీమలో అన్న నందమూరి, అక్కినేని తరం తరువాత అంతటి ప్రాధాన్యత ఉన్న హీరోలు తరువాత తరంలో మరో ఇద్దరు ఉన్నారు. వారే మెగాస్టార్ చిరంజీవి, నటరత్న నందమూరి బాలక్రిష్ణ. ఈ ఇద్దరూ ఎనభయ్, తొంభై దశకంలో తెలుగు తెరను ఓ ఊపు ఊపారు. ఇద్దరి మధ్యన గొడవలు ఉన్నాయని అంతా అనుకున్నా వారి వాదన తప్పు అని రుజువు చేస్తూ తమ స్నేహాన్ని కొనసాగించారు. ఇప్పటికీ ఇద్దరూ మంచి స్నేహితులుగానే ఉన్నారు.


ఇక లేటెస్ట్ గా బాలయ్య తీసిన అన్న గారి బ‌యోగ్రఫీ ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి తెలుగు చలన చిత్ర సీమకు చెందిన అథిరధ మహారధులు హాజరయ్యారు. అయితే మెగాస్టార్ మాత్రం రాలేదు. దాతో మరో మారు ఈ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయన్న రూమర్లు పుట్టాయి. అందరినీ పిలిచి బాలయ్య చిరంజీవిని పిలవలేదని కూడా కామెంట్స్ వచ్చాయి. ఇక నాగబాబు బాలయ్యని విమర్శించారని, దానికి అలిగిన బాలయ్య చిరంజీవిని పక్కన పెట్టాడని కూడా చెప్పుకొచ్చారు.


అయితే అవన్నీ తప్పు అన్న మాట ఇపుడు బయటకు వచ్చింది. ఆడియో ఫంక్షన్ కి రావాలని బాలయ్య చిరంజీవికి ఫోన్ చేసి కొరారట. అయితే చిరంజీని తాను హైదరాబాద్ లో లేనని, అందువల్ల వచ్చేందుకు కుదరదని చెప్పారట. సైరా షూటింగులో చిరు వేరే చోట ఉన్నారని అంటున్నారు. మొత్తానికి ఇదీ విషయం అని ఇపుడు అంతా అంటున్నారు. మరి చిరంజీవి, బాలయ్యల మధ్యన గొడవ ఎక్కడ జరిగిందో, ఏంటో పుకార్లు ప్రచారం చేస్తున్న వారే చెప్పాలని అంటున్నారు. అప్పట్లో బాలయ్య ఓ మారు తనకు టాలీవుడ్లో చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగతిని కూడా గుర్తుకు తెచ్చుకోవాలని కూడా చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: