అల్లు అర్జున్ ఈ ఏడాది చేసిన సినిమా ఒకే ఒకటి నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో అల్లు వారి అబ్బాయి ఇపుడు ప్రయోగాలకు నో అంటున్నారట. అంతే కాదు, ఏదో కధ చెప్పేసి సినిమా చుట్టేద్దామనుకున్న కుదరదని క్లారిటీతో చెబుతున్నాడత. పక్కాగా కధ అంతా వినడం, నచ్చకపోతే నో అనేయడం బన్నీ తీరుగా ఉందంటున్నారు. ఇక రీసెంట్ గా తీసుకుంటే బన్నీ ఎంతో మంది డైరెక్టర్ల కధలు వింటూ వచ్చారు 


ఇందులో చాలా మూవీస్ సెట్స్ పైకి వస్తాయని భావించినా చివరికి ఏదీ వర్కౌట్ కాలేదు. ఇందులో విక్రం కుమార్ తో చేస్తారని ప్రచారం జరిగిన సందర్భమూ ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే త్రివిక్రం బన్నీ హ్యాట్రిక్ మూవీకి ప్లాన్ చేశారని, తొందరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని ఈ మధ్యనంతా ఓ రేంజిలో ప్రచారం ఐతే జరిగింది. కానీ ఇపుడు అదంతా మారిందని అంటున్నారు. బన్నీ  కొత్తగా చేయబోయే మూవీకి డైరెక్టర్ పరశురాం అని వినిపిస్తోంది.


ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా పరశురాం ఈ రోజు వెల్లడించారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన నెక్స్ట్ మూవీ గీతా ఆర్ట్స్ లో ఉంటుందని, అందులో స్టార్ హీరో నటిస్తారని చెప్పుకొచ్చారు. పేరు చెప్పకపోయినా పరశురాం చెప్పిన దాని బట్టి బన్నీ తన ఓన్ బానర్లో  చేస్తున్న మూవీకి పరశురాం డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు. మరి మధ్యలో త్రివిక్రం మూవీ ఒకటి ఉండాలి కదా అన్న డౌట్ వస్తే మాత్రం అది ఇప్పటికి సస్పెన్సేనేమో. 



మరింత సమాచారం తెలుసుకోండి: