టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత మాస్ ఫాలోయింగ్ బాగా సంపాదించిన హీరోల్లో పవన్ కళ్యాన్ ముందుంటారు. అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు హీరోగాలుగా తమ సత్తా చాటుతున్నా..పవన్ కళ్యాన్ మాత్రం మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. మొదటి నుంచి సమాజ సేవ చేయాలనే ఆలోచనలో నుంచి ‘జనసేన ’అనే పార్టీ పుట్టింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాన్ జనసేన పార్టీ స్థాపించినప్పటికీ..పార్టీ బలోపేతం అయిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలని సంకల్పించిన విషయం తెలిసిందే.
‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ కళ్యాన్ పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నయ్యారు. ఇప్పటికే ఏపిలో కార్యక్రమాల్లో పాల్గొంటూ..ప్రచారాన్ని చేస్తున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల్లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ కు ఇప్పటిదాకా టాలీవుడ్ పెద్దగా సపోర్ట్ చేయలేదు. మొన్నటి వరకు ఈ పార్టీకి సంబంధించిన గుర్తు ఇవ్వలేదు..అందుకే కాస్త సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పడు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుగా ఇచ్చారు..అంతే ఒక్కసారే సీన్ మారిపోయింది. వరుణ్ తేజ్ బాబాయ్ పార్టీకి చందాగా కోటి రూపాయల విరాళం ఇవ్వడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. నాగబాబు సైతం పాతిక లక్షలు ఇవ్వడంతో ఇది ఇంకాస్త వైరల్ అయ్యింది. దాంతో అభిమానుల్లో సైతం ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు సైతం విరాళాల బాట పట్టబోతున్నట్టు సమాచారం. యూత్ లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉన్న ఓ యంగ్ హీరో భారీ మొత్తాన్నే సమీకరించినట్టు తెలిసింది.
పవన్ డై హార్డ్ ఫ్యాన్ అయిన మరో యంగ్ హీరో పవన్ కోసం వామ్మో అనిపించే అమౌంట్ ని రెడీ చేసాడట. ఇటీవలే హీరోగా ఓ ట్రయిల్ వేసిన కమెడియన్ సైతం ఇదే దారిలో ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా పార్టీ బలోపేతం చేయడానికి టాలీవుడ్ లో ఇంకా ఎంత మంది క్యూ కడతారో చూడాలి.