తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మద్య వరుసగా సినిమాలు తీస్తూ జోష్ మీద ఉన్నారు.  లింగ, కబాలి, కాలా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేక పోయాయి.  డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రోబో సినిమాతో భారత దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   ఈ సినిమా సీక్వెల్ 2.0 సుమారు రూ.500 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు.  ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇప్పటికే రూ.800 కోట్లు వసూళ్లు చేసి ఇంకా వసూళ్ల దిశగా సాగుతుంది. 
Image result for petta movie stills
2.0 సినిమా షూటింగ్ సమయంలోనే కార్తీక్‌ సుబ్బరాజ్ ద‌ర్శక‌త్వంలో ‘పెట్టా’మూవీలో నటించారు.  ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది.  ఆ మద్య పెట్టా సినిమాకు సంబంధించి లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేశారు.   ఈ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్స్, వీడియోస్‌ల‌లో ర‌జనీకాంత్ లుక్ స‌రికొత్తగా ఉండ‌డంతో అభిమానులు పేట మూవీపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. భారీ స్థాయిలో ఈ సినిమా విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తుండ‌గా ఈ నెల 28న చిత్ర ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. 
Image result for petta movie stills
ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను వచ్చే నెల మొదటి వారంలో భారీగా, విభిన్నంగా నిర్వహించనున్నట్లు స‌మాచారం. ఈ సినిమా  త్రిష గ్లామర్‌, సిమ్రన్‌ అభినయం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంద‌ని అంటున్నారు. చిత్రంలో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అనిరుధ్ ర‌విచంద్రన్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: