యువ హీరో శర్వానంద్ రీసెంట్ మూవీ పడి పడి లేచె మనసు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. హను రాఘవపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాతో పాటుగా సుధీర్ వర్మ డైరక్షన్ లో సినిమా కూడా సెట్స్ మీద ఉంచాడు శర్వానంద్.


ఈ సినిమాలో శర్వానంద్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించి టైటిల్ విషయంలో గొడవ జరుగుతుందట. మూవీ కాన్సెప్ట్ ప్రకారం దళపతి అని పెట్టాలని అనుకున్నారట. అయితే దళపతి టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ చేయించారట. ఆ నిర్మాతను కలిసినా టైటిల్ ఇవ్వనని చెప్పాడట. 


అందుకే శర్వ దళపతి అని టైటిల్ పెట్టాలని అనుకున్నారట దర్శక నిర్మాతలు. ఎందుకు గొడవలు అనుకుంటే దళపతి బదులు నాయకుడు టైటిల్ పరిశీలణలో ఉందట. మరి నాయకుడు అంటే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ఆ అంచనాలకు కాస్త అటు ఇటుగా ఉన్నా సినిమా రిజల్ట్ తేడా కొడుతుంది.


శర్వానంద్, సుధీర్ వర్మలు టైటిల్ విషయంలో తెగ కన్ ఫ్యూజన్ లో ఉన్నారట. మహేష్ ఖలేజా టైంలో కూడా ఇలాంటి టైటిల్ గొడవ ఏర్పడింది. అయితే మహేష్ ఖలేజా అని ఆ సినిమాను వదిలారు. మొత్తానికి శర్వానంద్, సుదీర్ ల సినిమా టైటిల్ ఏంటన్నది మరికొద్దిరోజుల్లో ఫైనల్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: