మెగస్టార్ చిరంజీవి ఇప్పటికీ వెండితెరకు తనదైన కమర్షియాలిటీతో కాసులు కురిపించే పవర్ ఫుల్ క్రౌడ్ పుల్లరే. ఆయన సినిమా వచ్చిందంటే థియేటర్ల వద్ద జాతరే. అటువంటి మెగా స్టార్ ఇపుడు సైరా చిత్రం ఫినిషింగులో బిజీగా  ఉన్నారు. ఆ తరువాత వెంటనే ఆయన సూప‌ర్ హిట్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో మూవీ చేస్తున్నారు. ఆ తరువాత మూవీని కూడా మెగస్టార్ లైన్లో పెట్టేయడమే ఇపుడు హాట్ టాపిక్. ఓ రేర్ కాంబోతో వస్తున్న ఈ మూవీని టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.


చిరంజీవిని దైరెక్షన్ చేయాలని ప్రతి ఒక్క దర్శకుడికీ ఉంటుంది. అయితే కొందరికి మాత్రమే ఆ చాన్స్ వస్తుంది. రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక చిరంజీవి ఇక దొరకడేమోనని అనుకున్న వారికి ఆయన మళ్ళీ రీ ఎంట్రీతో పండుగే తెచ్చారు. ఇపుడు ఒక్కొక్కరుగా తమ అద్రుష్టాన్ని చూసుకుంటూ మెగా స్టార్ తో మూవీకి రెడీ అవుతున్నారు. ఆ జాబితాలో ఎప్పటినుంచో ఉన్న మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కు ఇపుదు లక్కు తలుపు తట్టింది. చిరంజీవి తో సినిమా చేయాలన్న ఆయన తీరని కోరిక ఇపుడు తీరిపోతోంది.


చిరంజీవే ఈ విషయాన్ని స్వయంగా వినయ విధేయ రామ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడం విశేషం. త్రివ్రిక్రం డైరెక్షన్లో తాను ఓ మూవీ చేస్తున్నానని దానికి దానయ్య నిర్మాత అంటూ చిరంజీవి ప్రకటించి మెగాభిమానులకు సంతోషకరమైన న్యూస్ ని అందించారు. ఈ మూవీకి సెట్ చేసింది ఎవరో కాదని తన కుమారుడు, మెగా పవర్ స్టార్ రాం చరణ్ అని కూడా చిరంజీవి చెప్పడం విశేషం. మొత్తానికి త్రివిక్రం మార్క్ పంచ్ మాటలు చిరంజీవి నోట వినే రోజు తొందరలోనే వస్తుందన్న మాట. త్రివిక్రం కి కూడా ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాంటిందేనంటున్నారు. చూడాలి ఆయన కసి, క్రుషి ఏ రేంజిలో పండిస్తారో మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: