ప్రస్తుతం భారత దేశం గర్వించ దగ్గ దర్శకుల్లో ఒకరు ఎస్ ఎస్ రాజమౌళి. బాహబలి, బాహుబలి 2 సినిమాలతో జాతీయ స్థాయిలోనే కాదు..ప్రపంచ స్థాయిలో టాలీవుడ్ కి మంచి పేరు తీసుకు వచ్చారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాలు ఏ ఒక్కటీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోలేదు. ప్రస్తుతం మరో సంచలనానికి నాంది పలికారు..రాజమౌళి. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ కావడం. అయితే ఈ సినిమాలో కన్నడ హీరో యష్ విలన్ గా నటించబోతున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి...కానీ అధికారంగా ఏ ప్రకటన రాలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిమ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. రానా ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రానా ని మొదట అనుకోలేదని కానీ హిందీ మార్కెట్ కు ఫెరఫెక్ట్ ఛాయిస్ అవుతుందని తీసుకున్నట్లు చెప్తున్నారు. రానా కూడా మరోసారి రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఆత్రుతగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ జనవరిలో ప్రారంభంకానుంది.
మరోవైపు, ఈ సినిమా రెండు భాగాలుగా తీసే యోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. రెండు భాగాలుగా సినిమా తీస్తే... నిర్మాతలకు సేఫ్ ఉంటుందని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక్క విలన్ ఉంటాడా..ఇద్దరు విలన్లు ఉంటారా? అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ ఇద్దరు హీరోలకు ఇద్దరు స్టార్ నటులు విలన్లుగా నటిస్తే..ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించబోతున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ల పేర్లు మాత్రం బయటకు రాలేదు.