టాలీవుడ్ లో నందమూరి హీరోలు అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తారు తెలుగు ప్రేక్షకులు.  సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా నందమూరి బాలకృష్ణ, హరికృష్ణలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే రాజకీయాల్లో తండ్రికి సహాయకుడిగా హరికృష్ణ వెళ్లగా..హీరోగా కంటిన్యూ అయ్యారు బాలకృష్ణ.  ఇప్పటి వరకు ఎన్నో వైవిద్య పాత్రలు పోషించిన బాలకృష్ణ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’సినిమాతో వంద సినిమాలు పూర్తి చేసిన విషయం తెలిసిందే.  ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. 

ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’బయోపిక్ లో నటిస్తున్నారు బాలకృష్ణ.  ఈ సినిమా  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’రెండు భాగాలుగా రాబోతుంది.  ఈ సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు జూ.ఎన్టీఆర్, కళ్యాన్ రామ్.  హరికృష్ణ వారసులుగా పరిచయం అయిన ఈ ఇద్దరు హీరోల్లో జూ.ఎన్టీఆర్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్నారు.  గతంలో బాలకృష్ణకు ఎన్టీఆర్ కి విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చేవి. 

కానీ నందమూరి హరికృష్ణ మరణం తర్వాత బాలకృష్ణకు ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ ల మద్య సంబంధాలు బాగా పెరిగిపోయాయి.  ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బాబాయి ని ఇద్దరు హీరోలు ఆకాశానికి ఎత్తారు.  తాజాగా దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ, పూజా ప్ర‌సాద్‌ల వివాహం ఆదివారం రాత్రి ఘ‌నంగా జ‌ర‌గ‌గా, శనివారం రోజు సంగీత్ వేడుక జ‌రిపించారు.  ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్‌, అఖిల్ ల మధ్య సరదా సరదా సన్నివేశాలు, డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి.

ఇదే సమయంలో  అఖిల్ .. జై బాల‌య్య అంటూ అరిచాడు. మిగ‌తా వారు జై జై బాల‌య్య అంటూ అరిచారు. ప‌క్క‌నే ఉన్న ఎన్టీఆర్ కూడా అదే స్లోగ‌న్ అందుకొని హోరెత్తించారు.కాగా, నిన్న‌ కార్తికేయ వివాహ వేడుక జైపూర్‌లో వైభవంగా జరిగింది. రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు హీరోలు అక్కినేని నాగార్జున, అఖిల్, ప్రభాస్, రానా, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాని , జ‌గ‌ప‌తి బాబు , అనుష్క‌, కీరవాణి త‌దిత‌రులు వేడుక‌లో పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: