జబర్ధస్త్ యాంకర్ రష్మీ కి సుధీర్ కు మధ్య ఏదో రిలేషన్ ఉందని సోషల్ మీడియా లో న్యూస్ హల్ చల్ చేస్తుంటుంది. అయితే ఇదే విషయం మీద గెట్ అప్ శ్రీను మాట్లాడినాడు. ఇద్దరూ కలిసి వృత్తి పరంగా కలిసి షోలు చేయడం తప్ప... వ్యక్తిగతంగా వారి మధ్య ఏమీ లేదని తెలిపారు. రష్మి ఆమె షూటింగులు, ఫ్యామిలీ వ్యవహారాలతో బిజీ బిజీగా ఉంటారు. ఆవిడకు ఒక లైఫ్ గోల్ కూడా ఉంది. చాలా ఇంటర్వ్యూల్లో కూడా రష్మి ఇదే విషయం చెప్పారు. సుధీర్ తనకు ఫ్రెండ్ మాత్రమే. మేము కూడా అంతే. రష్మి అంటే మంచి వ్యక్తి, మా కుటుంబంలో ఒక అమ్మాయిలా చూస్తామని గెటప్ శ్రీను తెలిపారు. 

చిన్న తప్పు... అంతా రాంప్రసాద్ వల్లే

మాతో ఎవరితో అలాంటి రూమర్స్ రాకుండా సుధీర్ మీదనే రావడానికి మూల కారణం రాంప్రసాద్. సుధీర్-రష్మి మధ్య ఓ చిన్న ట్రాక్ పెట్టుకుందాం అని మొదలు పెట్టాడు. అలా అది కొనసాగుతూ మరో రకంగా టర్న్ అయింది. ‘వారు పెళ్లి చేసుకున్నారంట, పిల్లలంట, అదీ..ఇదీ అనే రూమర్స్ మొదలయ్యాయని గెటప్ శ్రీను తెలిపారు. టీవీలో ఏ ఫ్రోగ్రాం వచ్చిన జనాలు వెంటనే నమ్మేస్తారు. ఇలా జరుగడంలో మా పొరపాటు కూడా ఉంది. చివరకు ఇది సుధీర్ పర్సనల్ జీవితం మీద పడింది. ఇది ఇద్దరికీ ఎఫెక్ట్ అయింది. రష్మి ఎప్పుడూ ఈ విషయం నాకు వ్యక్తిగతంగా చెప్పలేదు కానీ సుధీర్ ఫ్యామిలీ అయితే బాధపడుతూ ఉంటారు. 

2019లో సుధీర్ పెళ్లి

మొదట్లో ఇదంతా బాగానే ఉండేది కానీ పెళ్లి సంబంధాలు చూస్తుంటే రష్మి-సుధీర్ మధ్య ఏదో ఉందట కదా? అని అడిగితే ఎవరికైనా బాధేస్తుంది. కానీ వారి మధ్య వాస్తవంగా ఏమీ లేదు. ఈ విషయం మాకు తెలుసు. మేము క్రియేట్ చేసిన ఈ రాపో ఆన్ స్క్రీన్ వరకు ఓకే. అందరూ తెరపై ఈ జంట బావుందని మెచ్చుకున్నారు. సినిమాల్లో చాలా మంది హీరో హీరోయిన్ల జంట బావుందని అంటారు. అంత మాత్రాన అవి నిజాలు కావుకదా. ఇది కూడా అంతే. 

మరింత సమాచారం తెలుసుకోండి: