టాలీవుడ్ లో ఈ సంవత్సరం కొరటాల శివ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. భరత్ అనే నేను సినిమాతో మహేష్ కెరీర్ లో రూ.200 కోట్ల క్లబ్ లో చేరారు. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత వంశి పైడిపల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’సినిమాతో రాబోతున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాల మహేష్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది.మరో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు.
ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడట మహేష్ బాబు. ఫస్టాఫ్ లో కోటీశ్వరుడి కుమారుడిగా రిచ్ గెటప్ లో కనిపించబోతున్నాడట. సెకండ్ ఆఫ్ లో రైతుల కోసం పోరాడే ఓ యువకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ సినిమా కావడం విశేషం. ఆ మద్య ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందులో మహేష్ బాబు స్టూడెంట్ గా కనిపించాడు.
తాజాగా ‘మహర్షి’కి సంబంధించిన సెకండ్ లుక్ను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు విడుదల చేశారు. ఈ చిత్ర షూటింగ్ భారీ ఎత్తున జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ పూర్తయింది. జనవరి రెండో వారం నుంచి మార్చి వరకు జరిగే షెడ్యూల్తో టోటల్గా షూటింగ్ పూర్తవుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి సాల్మన్, సునీల్బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.