అక్కినేని అఖిల్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. ఈ సినిమా టీజర్ చూస్తే స్ట్రెస్ రిలీఫ్ కు అఖిల్ కొత్త ట్రిక్ చెప్పేస్తున్నాడు.


సినిమాలో ప్లే బోయ్ అయిన హీరో హీరోయిన్ పరిచయం వల్ల ఎలా మారాడు అన్నది ఈ మిస్టర్ మజ్ను కథ అని తెలుస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ లో అఖిల్ లుక్ అదిరిపోయింది. అక్కినేని వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా అఖిల్, రెండో సినిమా హలో కూడా నిరాశపరచడంతో మిస్టర్ మజ్ను తో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు అఖిల్.


తొలిప్రేమతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను ని కూడా లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు. సవ్యసాచి సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ అన్న తర్వాత తమ్ముడితో జోడీ కడుతుంది. సినిమా మొత్తం యూరప్ లో షూటింగ్ జరుపుకుందని తెలుస్తుంది. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా తప్పకుండా అఖిల్ కు హిట్ ఇచ్చేలా ఉందని అంటున్నారు.


తండ్రి రొమాంటిక్ ఇమేజ్ తోనే తను హిట్ కొట్టాలని చూస్తున్న అఖిల్ ఈ సినిమాలో అన్ని అంశాలను పుష్కలంగా ఉండేలా చూసుకున్నట్టు తెలుస్తుంది. జనవరి 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అఖిల్ కు మొదటి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: