శ్రీ ముఖి ఎప్పుడు లేనిది ఇప్పుడు సోషల్ మీడియా  లో ఒక పోస్ట్ పెట్టింది. ప్రపంచం లో మనుషులకు మానవత్వం లేదని అంటుంది. ఎప్పుడూ హ్యాపీగా కనిపించే శ్రీముఖి.... తాజాగా సోషల్ మీడియాలో తన బాధను వెల్లగక్కుతూ ఓ పోస్టు పెట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యలు బట్టి శ్రీముఖి కొందరి వల్ల చాలా ఫెయిన్ ఫీలైనట్లు స్పష్టం అవుతోంది. అయితే దాని వెనక ఉన్న కారణం ఏమిటనేది శ్రీముఖి వెల్లడించలేదు. ఇంతకీ ఆమె ఏం పోస్టు పెట్టారో ఓ లుక్కేద్దాం. 

డబ్బు కోసం బ్రతుకున్నాం...

మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోందనే మాట సాధారణంగా చాలా మంది నా ముందు అనడం విన్నాను. నేను కూడా వ్యక్తిగతంగా కొన్ని సంఘటనలు ఎదుర్కొన్న తర్వాత అది నిజమే అని ఫీలవ్వక తప్పలేదు అని శ్రీముఖి తెలిపారు. సీరియస్లీ... ఇప్పుడు అందరూ కేవలం డబ్బు కోసమే జీవిస్తున్నారు. రాను రాను మనుషుల్లో హ్యుమానిటీ పూర్తిగా నశించి పోతుందేమో అనే భయం కలుగుతోంది అంటూ శ్రీముఖి తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు. 

అలా జరిగితే సంతోషిస్తా

మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోందనే మాట సాధారణంగా చాలా మంది నా ముందు అనడం విన్నాను. నేను కూడా వ్యక్తిగతంగా కొన్ని సంఘటనలు ఎదుర్కొన్న తర్వాత అది నిజమే అని ఫీలవ్వక తప్పలేదు అని శ్రీముఖి తెలిపారు. శ్రీముఖి పోస్టుపై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ... ‘నువ్వు చేస్తున్న పటాస్ కార్యక్రమం వల్గర్‌గా ఉందని చాలా మంది ఫీలవుతున్నారు. అయినా నువ్వు ఆ షో చేస్తూనే ఉన్నావు... నువ్వు ఆ షో చేసేది డబ్బు కోసం కాదా? ఈ ప్రపంచంలో డబ్బు లేకుండా ఎవరూ సర్వైవ్ కాలేరు' అని వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: