జబర్ధస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన యాంకర్ అనసూయ అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది.  దాంతో వెండితెరపై తన అృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నించిన అనసూయ ‘సోగ్గాడే చిన్నినాయన’సినిమాతో నాగార్జున సరసన ఓ పాటలో ఆడిపాడింది.  ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.  దాంతో తిరిగి జబర్ధస్త్ లో యాంకర్ గా కంటిన్యూ చేస్తూ వస్తుంది. గత రెండు సంవత్సరాల నుంచి అనసూయకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. 
Related image
గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’సినిమాలో అనసూయ..రంగమ్మత్తగా నటించింది.  ఈ సినిమాలో రాంచరణ్ కి రంగమ్మత్తగా నటించిన అనసూయకు వరుసగా సినిమాల ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  తాజాగా ఈ పాత్రకిగాను 'జీ సినిమా అవార్డ్స్ 2018' వేడుకలో అవార్డును సొంతం చేసుకుంది. 'రంగమ్మత్త' పాత్రకి గాను తొలి అవార్డు 'జీ సినిమా అవార్డ్స్' వేదికపై అందుకున్న అనసూయ, ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించింది. ఈ అవార్డుకిగాను నన్ను ఎంపిక చేసిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 
Image result for anasuya zee cinema awards rangammatta
జీ సినిమా అవార్డ్స్' నుంచి రంగమ్మత్త పాత్రకిగాను తొలి అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. అయితే అవార్డు గెల్చుకున్న ఆనందంలో నేను ఒక యాంకర్ అన్న విషయాన్ని మర్చిపోయాను..వేదికపై సరిగా మాట్లాడలేక పోయాను. ఒక రకంగా చెప్పాంటే..అప్పుడు నా స్పీచ్ పెద్ద డిజాస్టర్ అని నేను భావిస్తున్నాను.  అంతే కాదు నా స్పీచ్ లో మైత్రీ మూవీ మేకర్స్ .. చరణ్ .. రత్నవేలు .. దేవిశ్రీ .. నా భర్త .. అమ్మానాన్నలకీ, 'రంగస్థలం' సిబ్బందికి థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయాను. ఇందుకు నేను చాలా బాధపడుతున్నాను..మీరంతా కూడా నా క్షమాపణలను అంగీకరించాలని కోరుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: