వరసగా హిట్లు మీద హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి ఈ సంక్రాంతి రారాజు అయ్యారు. ఆయన తీసిన ఎఫ్ 2 మూవీ ధియేటర్లలో పండుగలో సందడి చేస్తోంది. సీనియర్ హీరో వెంకటేశ్, మెగా హీరో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రిన్ కౌర్లతో కలిపి చేసిన కామేడీకి జనం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేగా అంటూ ఈ సినిమాతో పెద్ద సినిమాలానే అనిపించేసిన  అనిల్ రావిపూడి ఇపుడు టాలీవుడ్ టాప్ లిస్ట్ లోకి చేరిపోయాడు. 


పటాస్ మూవీతో లాంచ్ అయిన అనిల్ రావిపూడి ఆ తరువాత సుప్రీం, రాజ ది గ్రేట్ మూవీస్ ద్వారా హిట్ల మీద హిట్లు కొడుతూనే ఉన్నాడు. ఎక్కడ తన కామెడీ ట్రాక్ తప్పకుండా సినిమాను హిట్ చేసుకుంటూ వస్తున్న ఆయన ఇపుడు నట సిమ్హం నందమూరి బాలక్రిష్ణ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్. నిజానికి చాలాకాలంగా అనిల్ రావిపూడి తో బాలయ్య మూవీ ఉంటుందని వినిపిస్తూనే ఉంది. అయితే ఇపుడది వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. 


బాలక్రిష్ణ తరువాత చిత్రం బోయపాటి శీనుతో ఉంటుందని అంటున్నారు. ఆ మూవీ తరువాత అనిల్ రావిపూడి తో సినిమావే అవుతుందని తెలుస్తోంది. దీనిపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఎఫ్ 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నానని, సంక్రాంతికి ఊరెళ్ళి వస్తానని అపుడు మంచి కధతో బాలయ్యను కలుస్తానని  అంటున్నాడు ఈసారి కామెడీ  కాకుండా మంచి పవర్ ఫుల్ స్టోరీ ఉంటుందని అంటున్న అనిల్ తన మార్క్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మిస్ కాదని చెప్పుకొచ్చారు. మరి రామారావు గారు అని అప్పట్లో ఓ టైటిల్  ఈ ఇద్దరి కాంబోతో తీస్తారని వినిపించింది. కానీ మరి ఆ కధతో చేస్తారా లేక వేరే మూవీ ఉంటుందా అన్నది చూడాలి. మొత్తానికి కామేడీ మార్క్ తో హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి మాస్ హీరో బాలయ్య కాంబో ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: