సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ మహర్షి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. అశ్వనిదత్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగమవుతున్నారు.


పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా కన్ ఫాం చేశాడు. 1 నేనొక్కడినే తర్వాత మహేష్, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ సినిమా కథా చర్చలు నడుస్తున్నాయి. ఇదిలాఉంటే సుక్కు సినిమా తర్వాత మహేష్ సందీప్ వంగ సినిమా చేస్తాడని అంటున్నారు.


గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో తన ప్రతిభ కనబరచిన సందీప్ వంగ మహేష్ తో సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ప్రస్తుతం సందీప్ వంగ అర్జున్ రెడ్డి హింది రీమేక్ లో బిజీగా ఉన్నాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఆ రీమేక్ కు కబీర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.


ఇక మహేష్, సందీప్ వంగ సినిమాకు టైటిల్ గా షుగర్ ఫ్యాక్టరీ అనే టైటిల్ అనుకుంటున్నారట. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ పోలీస్ గా కనిపిస్తారట. మహేష్ పోలీస్ గా కనిపించిన పోకిరి, దూకుడు సూపర్ హిట్లు అయ్యాయి. ఆ తరహాలో సందీప్ వంగ సినిమా కూడా సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా మిగతా డీటైల్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: