సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ ఈ మద్య తీస్తున్న సినిమాలు రిలీజ్ కి ముందు ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి రాంగోపాల్ వర్మ తీసుకునే కథాంశాలు కూడా వివాదాలు కూడుకున్నవే కావడం విశేషం. ప్రతి సినిమాలోనూ తనదైన శైలిలో తీసే రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు క్రిష్ దర్శకత్వం లో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరిలో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ కాబోతుంది.
ఇదే సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా ఎంటర్ అయ్యింది..తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారాయి అన్న అంశాలతో కొన్ని భయంకర నిజాలు వెలుగు లోకి వస్తాయంటే వర్మ స్టేట్ మెంట్ ఇవ్వడం జరిగింది. నందమూరి తారక్ రామారావు గారి జీవిత చరిత్రపై ఎవరు ఎన్ని సినిమాలు తీసినా సరే పై లోకంలో ఉన్నటువంటి అన్న గారికి నూటికి నూరు పాళ్ళు తాను తీస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాయే నచ్చుతుందని, రామ్ గోపాల్ వర్మ ఛాలెంజ్ చేసి మరీ చెప్పారు.
తాను తీసే సినిమాలో మాత్రమే అసలు సిసలైన నిజాలు ఉన్నాయని వర్మ బాంబు కూడా పేల్చారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టేశారు. తాను తీస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఆ రామారావు గారు చనిపోయిన రోజున జనవరి 18న అంటే నేడు వర్ధంతి సందర్భంగా సాయంత్రం 5గంటలకు జీవం పోసుకోబోతుంది అని సంచలన ట్వీట్ ఒకటి పెట్టారు.
దీంతో అసలు ఆర్జీవీ ఏం ప్రకటన చేయబోతున్నారు..? సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ వదులుతారా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో మీ ప్రకటన కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అది ఫస్ట్ లుక్కా లేక టీజరా లేక ట్రైలరా అని ఆర్జీవీ ని ఫాలో అయ్యే వాళ్ళు జుట్టు పీక్కుంటున్నారు. ఈరోజు సాయంత్రం వర్మ ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారో వెయిట్ చెయ్యాలి.
Lakshmi’s NTR will come alive on the death anniversary of NTR.. jan 18 th 5 PM pic.twitter.com/8oLZ62UVIW
— Ram Gopal Varma (@RGVzoomin) January 17, 2019