బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారాడు. అందుకే ఆ సినిమా తర్వాత మూవీని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ప్రభాస్ సాహో మూవీ హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉండేలా యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈమధ్య వచ్చిన మేకింగ్ వీడియో ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో శాంపిల్ గా చూపించారు.


యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సాహో సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో ఓపెనింగ్ సీన్.. అదే ప్రభాస్ ఎంట్రీ సీన్ రాబరీ సన్నివేశమట. ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని విధంగా ఆ సీన్ ఉంటుందని అంటున్నారు. ఇది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ అరుపులు కేకలేయడం ఖాయమని చెబుతున్నారు.


హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా సాహో ఉంటుందట. అబి దుబాయ్ లో ఫైటింగ్ సీన్ కోసం పాతిక కోట్లు ఖర్చు పెట్టారు దర్శక నిర్మాతలు. రన్ రాజా రన్ సినిమా చేసిన సుజిత్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ మోయగలగడం మాములు విషయం కాదు. సుజిత్ తన మీద నిర్మాతలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ సినిమా చేస్తున్నాడట. 


శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. మరి సాహో ప్రభాస్ చేసే సర్ ప్రైజులు ఎలా ఉంటాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: