అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఎన్టీఆర్ కథానాయకుడు కు తేజ దర్శకత్వం చేసి ఉండాల్సింది. కానీ ఏమైందో ఏమో కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి తేజ తప్పుకున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత తేజ వివాదాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయలేమోననే భయంతోనే తప్పుకున్నట్లు వెల్లడించి సైలెంట్ తన దారి తాను చూసుకున్నారు.

అది దర్శకుడిపైనే...

అయితే సంక్రాంతికి ‘ఎన్టీఆర్-కథానాయకుడు' విడుదలైన తర్వాత ఈ సినిమాపై తేజ అభిప్రాయం తెలుసుకోవాలని మీడియా వారు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే తన తాజా చిత్రం ‘సీత' ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా తేజ మీడియా ప్రతినిధులకు ఎదురు పడ్డారు . ఎన్టీఆర్-కథానాయకుడు'పై తేజ ఎలా రియాక్ట్ అవుతారో అంటూ ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. బిజీగా ఉండటం వల్ల తాను సినిమా ఇంకా చూడలేదని, ఒక వేళ చూసి ఉంటే మాట్లాడేవాన్ని అంటూ... తెలివిగా అందరి నోటికి తాళం వేశారు. 

రిలీజ్ తర్వాత మీడియాకు కనిపించని తేజ

సినిమాలో డ్రామా తగ్గిందనే విమర్శలకు వస్తున్నాయనే ప్రశ్నపై స్పందిస్తూ... అది దర్శకుడిపై ఆధార పడి ఉంటుందని, తాను సినిమా చూడలేదు కాబట్టి ఏమీ మాట్లాడలేనని తేజ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. మరి అప్పటివరకైనా తేజ తన చేతి నుంచి జారిపోయిన ఈ బయోపిక్ చూస్తారో? లేదో? తేజ దర్శకత్వంలో ప్రస్తుతం 'సీత' అనే చిత్రం తెరకెక్కుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ మూవీని ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: