టాలీవుడ్ లో పవన్ కళ్యాన్ హీరోగా ‘బద్రి’సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు పూరి జగన్నాధ్.  సంచలన దర్శకుడు రాంగోపాల్ శిశ్యుడిగా కెరీర్ మొదలు పెట్టిన పూరి ఇడియట్ సినిమాతో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.  ఇక మహేష్ బాబు తో తీసిన పోకిరి అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో రికార్డుల మోత మోగించాడు.  ఎన్టీఆర్ తో తీసిన టెంపర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కి ఏది కలిసి రావడం లేదు.  తన తనయుడు ఆకాశ్ పూరితో సినిమా తీస్తే అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  దీంతో ఈసారి తన సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నారు. 
Image result for mr majnu
టాలీవుడ్ లోకి దేవదాసు సినిమాతో హీరోగా పరిచయం అయిన రామ్ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయాన్ని దక్కించుకోలేదు.  ఆ మద్య కీర్తి సురేష్ నటించిన నేను శైలజ కాస్త పరవాలేదు అనిపించుకున్నా ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.  ప్రస్తుతం పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’సినిమా రాబోతుంది.   ఈ సినిమాలో టైటిల్ కి తగ్గట్టు గానే రామ్ లుక్ ఉండబోతుందని..మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.  దర్శకుడు పూరీ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూలు ఇటీవలే ముగిసింది. అయితే, ఇంతవరకు హీరోయిన్ ఎవరన్నది మాత్రం ప్రకటించలేదు.   
Image result for ismart shankar
ఇటీవల అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేష్ వంటి హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి.  తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’సినిమాలో హీరోయిన్ ని కన్మాఫ్ చేశారు.  'మిస్టర్ మజ్ను' తో అఖిల్ సరసన నటించిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. 'నిధి అగర్వాల్ ఇస్మార్ట్ గాళ్' అంటూ క్యాప్షన్ కూడా ఇవ్వడంతో ఈ చిత్రంలో ఒకే హీరోయిన్ నటిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు.      



మరింత సమాచారం తెలుసుకోండి: