ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో పైరసీ రక్కసితో నిర్మాతలు ఎంతో నష్టపోతున్నారు.  స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే నెట్ లో ప్రత్యక్షం కావడం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  నిర్మాత మండలి ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించుకున్నా..ఆ సమయంలో కొన్ని వెబ్ సైట్లపై చర్యలు తీసుకుంటున్నా పైరసీని మాత్రం అరికట్టలేక పోతున్నారు.  మరోవైపు స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు లోకేషన్స్, పర్సనల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
Related image
సెట్స్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని షూటింగ్ లొకేషన్స్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అవుతున్నాయి.  గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’షూటింగ్ లోకేషన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.  ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ‘మహర్షి’సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

ఈ సినిమా షూటింగ్ ఓ పల్లెటూరి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతుండడంతో మహేష్ ని చూడడానికి జనాలు ఎగబడ్డారు. వారిని అదుపు చేయలేకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. కొందరు ఔత్సాహికులు షూటింగ్ కి సంబంధించిన వీడియోను తీశారు. 

మహేష్ మీడియాతో మాట్లాడే సన్నివేశానికి సంబంధించిన ఫోటో లీకైంది.ఈ సినిమాలో మహేష్ గుబురు గడ్డంతో కనిపించబోతున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: