టాలీవుడ్లో ఓ యంగ్ హీరో పదే పదే పాలిటిక్స్ మీద వరసగా కామెంట్స్ చేస్తున్నారు. అతను చేస్తున్న కామెంట్స్ కొన్ని హాట్ గా కూడా ఉంటున్నాయి. అసలే  ఎన్నికల సీజన్. ఆ హీరో గారు గత కొంతకాలంగా సినిమాలు కూడా చేయడంలేదు. దేశంలో జరిగే ప్రతి పరిణామంపై తన భావాలను కామెంట్స్  ద్వారా పంచుకుంటున్నా ఆ హీరో ఇపుడు అందరి చూపుల్లో ఉన్నారు.


దాదాపుగా అయిదు వందల పై చిలుకు మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేక‌ స్థానం కలిగిన విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు రెండవ కుమారుడు మనోజ్ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన‌ సినిమాలు ఆశించిన విజయం సాధించండంలేదు. దాంతో మనోజ్ సినిమాలకు కొంత విరామం ప్రకటించారు. అదే టైంలో ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.


ఏపీకి కియా మోటార్స్ వచ్చినందుకు ఆయన టీడీపీ సర్కార్ ని మెచ్చుకున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక హోదా రానందుకు ఆయన ఏకంగా ప్రధాని మోడీ మీదనే కామెంట్స్ చేశారు. బాలాజీ ఆగ్రహానికి గురి కావద్దంటూ చేసిన ట్వీట్ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ మనోజ్ పయనం ఏంటి. ఆయన సీరియస్ గా రాజకీయాల మీద ద్రుష్టి పెడుతున్నారా అన్న ఆలోచన కలుగుతోంది. ఏపీలో ఉన్న మూడు పార్టీల్లో ఆయన దేంట్లో చేరుతారన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి మంచు వారబ్బాయి చలికాలంలో వేడి పుట్టిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: