టాలీవుడ్లో చాన్స్ అంటేనే ఎవరైనా ఎగిరిగంతేస్తారు అంతా. ఎందుకంటే ఇక్కడ టాలెంట్ కంటే బ్యూటీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. పైగా కోట్లు కుమ్మరిస్తారు. అందుకే ఇక్కడకు తారలు క్యూ కడతారు. ఇక అందం, అభినయం రెండూ ఉన్న వారికి తెలుగు చిత్ర సీమ ఎర్ర తివాచీయే పరుస్తుంది. 


ముకుందా మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఇపుడు నక్కను తొక్కింది. అందుకే లక్కుతో జట్టు కట్టేసిందని అంతా అంటున్నారు. ఆమె మహేష్ బాబు తో చేసే మూవీ తో ఈ ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఆ మూవీకి గాను పూజకి అందిన రెమ్యున‌రేషన్ పై ఇపుడు హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఏకంగా  కోటీ 75 లక్షలు ఈ అమ్మడికి ఇచ్చారని ప్రచారమైతే ఉంది. అంత పెద్ద మొత్తమేనని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు కానీ ఈ ముద్దు గుమ్మ డిమాండ్ అలాంటిది మరి అంటున్నారు.


ఈ ఒక్క మూవీకేనా లేక మళ్ళీ ఇంత భారీ మొత్తం నెక్స్ట్ మూవీకి కూడా ఇస్తారా అన్నది చూడాలి. దీని తరువాత ప్రభాస్ తో పూజా జోడీ కడుతోంది. ఈ రెండు మూవీస్ ఇంటెరెస్టింగ్ మూవీసే మరి. ఇక పూజాకు తెలుగులో పెద్దగా హిట్లు పడలేదు అరవింద సమేత మూవీ మామూలు హిట్ తప్ప బ్లాక్ బస్టర్ కాదు. కానీ డిమాండ్ మాత్రం పూజదే అవుతోంది. ఎందుకిలా అంటే టాలీవుడ్ కాబట్టి అంటున్నారు. ఎంతైనా అందమే కాదు. అద్రుష్టం కూడా నిండుగా ఉన్న తార పూజా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: