రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్సపై ‘శ్రీ ఓం సినిమా’ సమర్పణలో కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న సినిమా ‘తిప్పరా మీసం’. ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు శ్రీవిష్ణు. ప్రస్తుతం శ్రీ విష్ణు బ్రోచేవారెవరురా అనే సినిమా చేస్తున్నాడు. మెంటల్ మదిలో వంటి సినిమా తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమా తెరకెక్కిస్తుండగా ఇందులో నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. టైటిల్కు తగ్గట్టుగా గుబురు గడ్డంతో మాస్లుక్లోకి మారిపోయారు శ్రీవిష్ణు. కృష్ణవిజయ్.. నారా రోహిత్ తో పాటు శ్రీవిష్ణుకు కూడా మంచి మిత్రుడు. విష్ణు హీరోగా తెరకెక్కిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకు రోహిత్ తో పాటు కృష్ణవిజయ్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం. ‘అసుర’ తర్వాత దర్శకుడిగా చాలా గ్యాప్ తీసుకున్న కృష్ణవిజయ్.. ఇప్పుడు శ్రీవిష్ణును హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే విడుదల చేయనున్నారు.
దర్శకుడు విజయ్ మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకేకథ చిత్రాల తరువాత ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామ్యం చేస్తూ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. "విజయ్ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను. కొన్ని ఏళ్లుగా మేము కలిసి పనిచేస్తున్నాము. ఈ సినిమా అందరికి నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను" అన్నారు.