మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా రంగస్థలం. 2018లో వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి సత్తా చాటాడు రాం చరణ్. రాం చరణ్ లోని నటనను వెలికి తీసి చిట్టిబాబుగా చితక్కొట్టేశాడు మెగా వారసుడు.


పిరియాడికల్ మూవీగా వచ్చిన ఈ సినిమా దర్శకుడు సుకుమార్ కు సెన్సేషనల్ విజయాన్ని అందించింది. శ్రీమంతుడుతో నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ రంగస్థలంతో అదిరిపోయే హిట్ కొట్టారు. ఇక ఈ సినిమా కథ ఎలా మొదలైంది సుకుమార్ అసలు చరణ్ ను ఎలా అప్రోచ్ అయ్యాడు అన్నది ఈమధ్య చెప్పాడు చరణ్.


రానా టాక్ షో నంబర్ 1 యారిలో సుకుమార్ తన కామన్ ఫ్రెండ్ తో ఇంటికి వచ్చాడని.. ఆ టైంలో బన్నితో చేశావ్ నాతో ఎప్పుడు చేస్తావ్ అని అంటే.. రేపు రానా ఓ సబ్జెక్ట్ ఉందని అన్నాడట సుకుమార్. అలా ఓ లంచ్ రంగస్థలం సినిమా కథను తన దగ్గరకు వచ్చిందని చెప్పాడు చరణ్. మగధీర తర్వాత రాం చరణ్ స్టామినా చూపించిన సినిమా రంగస్థలం.


సినిమాలో సౌండ్ ఇంజినీర్ అదేనండి చెవిటి వ్యక్తిగా రాం చరణ్ నటన మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సగటు సిని ప్రేక్షకుడిని మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా మళ్లీ చరణ్ కు నిరాశ మిగిల్చింది. ప్రస్తుతం రాం చరణ్ రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ తో పాటుగా ఎన్.టి.ఆర్ కూడా నటిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: