ఈ మద్య సినీ పరిశ్రమలో వరుసగా బయోపిక్ సినిమాలు తీస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్నిభాషల్లో వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఇటీవల తెలుగు లో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ అయ్యాయి. ఇందులో మహానటి సూపర్ హిట్ టాక్ రాగా..ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా చేసుకొని దర్శకుడు మహి వి రాఘవ ‘యాత్ర’సినిమా తీశారు.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాటలు, టీజర్స్, పోస్టర్స్తో అంచనాలను మించిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజన్నను గుర్తుకు తెచ్చుకుని.. నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయామని..‘యాత్ర’ సినిమా కాదు.. మహానాయకుడి జీవితం.. రాజన్న వ్యక్తిత్వానికి నిలువుటద్దం అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు..కొన్ని సీన్లలో నిజంగా వైఎస్సార్ తమ కళ్లముందుకు వచ్చారా అన్న ఆశ్చర్యానికి లోనయినట్లు తెలుపుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు రాజన్నను చూస్తున్నట్టే ఉందని రాజన్నకు యాత్ర ఘన నివాళి అంటూ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. విడుదల అన్ని కేంద్రాల్లో వైఎస్ఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.