తెలుగు సినిమా రంగంలో సీనియర్ మోస్ట్ హీరో నందమూరి బాలక్రిష్ణ. ఆయన వందకు పైగా మూవీస్ లో నటించి ఇప్పటికీ  నాటౌట్ అంటున్నారు. లేటెస్ట్ గా తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను నిర్మించి నటించిన బాలయ్య ఇపుడు మహానాయకుడు మూవీని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ తరువాత మూవీ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఉంటుంది. ఈ మూవీకి సంబంధించిన కధను బాలయ్య ఒకే చేశారని, ఏప్రిల్ నుంచి షూటింగ్ జరుగుతుందని అంటున్నారు.


ఇక ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ వెలుగు చూస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. బాలయ్యతో ఈ మధ్యనే కధానాయకుడు మూవీలో ఆకు చాటు పిందె తడిసే అంటూ డ్యాన్స్ చేసిన రకుల్ ఇపుడు ఏకంగా ఫుల్ లెగ్త్ హీరోయిన్ గా స్టెప్పులేయబోతోంది. ఈ క్రేజీ కాంబోను బోయపాటి కలిపాడని అంటున్నారు. 


బోయపాటి డైరెక్షన్లో సరైనోడు, జయ జానకీ రామా మూవీస్ లో రకుల్ హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య తోనూ ఆడిపాడిన రకుల్ ఏకంగా ఆయనకే ఇపుడు సరి జోడీ అయిపోయింది. ఈ జంట బోయపాటి దైరెక్షన్లో ఎలా సాంగులేసుకుంటుందో చూడాలి మరి. ఇదిలా ఉండగా ఇదే మూవీలో రెండవ హీరోయిన్ గా శ్రధ్ధా శ్రీనాధ్ ని ఎంపిక చేశారని అంటున్నారు. ఏ భామ ప్రస్తుతం తెలుగులో జెర్సీ మూవీలో నాని పక్కన నటిస్తోంది. ఇక బోయపాటి తో తీసే మూవీని బాలయ్య తన ఎన్ బేకే  బ్యానర్ మీద తీయడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: