టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషన్ అవడం చూస్తూనే ఉన్నాం.  ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఎన్నో కాంట్రవర్సీ విషయాలు పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాం.  రాజకీయ, సినీ రంగానికి చెందిన వారిపై వ్యంగ్యంగా ఎన్నో పోస్టులు చేస్తూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  కొన్ని సార్లు వార్నింగ్ లు వచ్చినా..వాటికి తిరిగి ఘాటైన సమాధానం చెబుతూ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం వర్మకు పరిపాటైంది. 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ పై పలు సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తున్న నేపథ్యంలో మొదటి భాగం సంక్రాంతి బరిలో దించారు.  ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22 న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.  ఇక రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై రక రకాలుగా ప్రమోషన్ చేస్తున్నారు.

  ఈ సినిమాకు సంబంధించి ఒక్కో ఫోటో రిలీజ్ చేస్తున్నారు.  ఇప్పటికే లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేశారు.   ప్ర‌స్తుతం తాను తెర‌కెక్కిస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైల‌ర్‌ని మ‌హానాయ‌కుడు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన రోజు విడుద‌ల చేస్తాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించాడు.  కృతజ్ఞతలేని కుటుంబాలు, విశ్వాసంలేని అనుచరులు, వెన్నుపోటు పొడిచే ద్రోహులతో కూడిన లవ్ స్టోరీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. అసలు సిసలైన కథ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ అప్పుడు ట్వీట్ వదిలారు వ‌ర్మ‌. 

అయితే మ‌హానాయ‌క‌డు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌క‌ముందే ఫిబ్రవరి 14న ఉదయం 9.27 గంటలకు జీవీ ఫిల్మ్స్ ట్రైల‌ర్‌ విడుదల చేస్తుంది.  తాజాగా మ‌హానాయ‌కుడు చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేస్తామ‌ని బాల‌య్య అండ్ టీం ప్ర‌క‌టించే స‌రికి ఆ రోజు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర థియేట్రికల్ ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ట్వీట్‌లో తెలిపారు .ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని చూసేందుకు థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకులు లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ కూడా చూడొచ్చంటూ మరో సంచలన ట్విట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: