వెండితెర చందమామ కలువ కన్నుల కలల భామ కాజల్ అగర్వాల్ అగ్ర శ్రేణి హీరోయిన్ గా టాలీవుడ్ ని  ఓ లెక్కలో ఏలింది. టాప్ హీరోలతో స్క్రీన్ పంచుకుని ఆడి పాడింది. కాజల్ కోసం కలవరించే కుర్ర కారు ఎంతో మంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు, ఆయన తనయుడు రాం చరణ్ తోనూ నటించి మెప్పించిన రేర్ హీరోయిన్ గా రికార్డు సొంతం చేసుకుంది.


కాజల్ సినిమా పరిశ్రమకు వచ్చి ఈ నెల 15తో సరిగ్గా పన్నెండేళ్ళు పూర్తి అవుతాయి. డర్శకుడు తేజా  డైరెక్షన్లో కళ్యాణ్ రాం హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా సరిగ్గా ఇదే రోజు 2007లో రిలీజ్ అయింది. నాటి నుంచి కాజల్ వెనుతిరిగి చూడలేదు. ఎన్నో మూవీస్ వరసగా చేసి స్టార్ డం సొంతం చేసుకుంది. మగధీర మూవీతో రాజకుమారి గా యూత్ కి కిర్రాకు పుట్టించింది. 


మరి ఈ మధ్యన కెరీర్ స్లో అవుతోందని తెలుసుకున్న ఈ చిన్నది కొత్త పాత్రలోకి మారడానికి చూస్తోందట. త్వరలో కాజల్ నిర్మాతగా మారబోతోందని  తెలుస్తోంది. తన బ్యానర్ పేరును కే యే వెంచర్స్ గా పెట్టి మంచి కాన్సెప్ట్ తో సిన్మాలు తీయాలనుకుంటోందట. తన అభిరుచికి తగిన సినిమాలు తీయడం ద్వారా మంచి నిర్మాత అనిపించుకోవాలనుకుంటుందంట.  గత ఏడాది అ! మూవీ తీసిన ప్రశాంత వర్మ దర్శకత్వంలో ఓ మూవీకి కాజల్ డిజైన్ చేస్తోందని టాక్. మరి చూడాలి కాజల్ కొత్త అవతారంలో ఎలా రాణిస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: