టాలీవుడ్ లో ఒకప్పుడు రొమాంటిక్ హీరో అంటే అక్కినేని నాగేశ్వరరావు అనేవారు..ఆ తర్వాత సోగ్గాడు శోభన్ బాబు అనేవారు..ఆ తర్వాత ఫ్యామిలీ హీరో అంటే వెంటనే గుర్తుకు వచ్చేది జగపతి బాబు. ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడుగా జగపతి బాబు పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగపతి బాబు పలు సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితం అయిన జగపతిబాబు ఇప్పడు తెలుగు, తమిళ, మళియాళ, హిందీ భాషల్లో కూడా నటిస్తున్నారు.
హీరోగా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో విలన్ గా చాన్స్ రావడంతో బాగా బిజీ అయ్యాడు. ఇక టాలీవుడ్ లో ఎస్వీ కృష్ణ రెడ్డి అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అనేవారు. ఆయన తీసిన పలు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు, ఆమని, రోజా కాంబినేషన్ లో ‘శుభలగ్నం’సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. వైఎస్సార్ బయోపిక్ ''యాత్ర'' సినిమాను నిర్మించిన 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ ని తీసుకోబోతున్నారని సమాచారం. శభలగ్నం సినిమాలో ఆమని డబ్బు కోసం తన భర్త జగపతి బాబుని.. రోజాకి అమ్మడం..తర్వాత డబ్బు కాదు..భర్త ప్రేమ గొప్పదని తెలుసుకుంటుంది. ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. అదే చిత్రానికి 25ఏళ్ల తర్వాత ప్రస్తుతం సీక్వెల్ రానుంది. తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రీమేక్ అయ్యింది.