విశాఖ అంటేనే టాలీవుడ్ కి అదో రకమైన కిక్కు. ఇక ఇక్కడ అందాలు ఎపుడు ఎవర్ గ్రీన్ పదహారణాల హీరోయినే. ఎన్నో సినిమాలు విశాఖ వేదికగా షూట్ చేసుకుని ఆడియన్స్ ని అలరించాయి. . ఓ జంధ్యాల‌, ఓ బాలచందర్, దాసరి, విశ్వనాధ్ వంటి ప్రముఖులు విశాఖ సొగసులను తమ మూవీస్ లో బంధించి ఉంచారు.


అటువంటి విశాఖలో ఆడియో ఫంక్షన్లు సైతం ఎక్కువగా జరుగుతాయి. రీసెంట్ గా వెంకీ, వరుణ్ తేజ్ ల మూవీ ఎఫ్ 2 ఆడియో ఇక్కడే రిలీజ్ చేశారు. ఇక విశాఖకు సినిమా తారలు షూటింగుల కోసం రావడం  ఎపుడూ ఉంటుంది. దానికి తోడు సినిమా ఫంక్షన్లు పెట్టి మరీ స్టార్లను రప్పించడం కూడా జరుగుతుంది. విశాఖతో అనుబంధం పెంచుకున్న టీ సుబ్బరామిరెడ్డి వంటి తరచూ  వారు ఏదో ప్రోగ్రాం పెడుతూ సినిమా నటులను విశాఖకు రప్పిస్తుంటారు.


లేటెస్ట్ గా విశాఖ పట్నంలో  పోర్ట్ స్టేడియంలో  ఫిబ్రవరి 17న టీఎస్సార్ అవార్డుల ప్రదానం వేడుకను ఘనంగా  నిర్వహిస్తున్నారు. ఈ అవార్డులకు  ముఖ్యంగా టాప్ టాలీవుడ్  స్టార్లు ఎవరినీ టీఎస్సార్ వదిలిపెట్టనే లేదు. చిరంజీవి - బాలకృష్ణ సహా నాగార్జున - రామ్ చరణ్ - అడవి శేష్ ఇలా అందరినీ కలుపుకుంటూ రెండేళ్లకు పురస్కార విజేతల్ని ప్రకటించారు. ఏదేమైనా అందరినీ ఒకే వేదికపై చూసుకోవాలన్న కళాబంధు తృష్ణ గెలిచింది ఇక్కడ. మొత్తానికి ఆ రోజున విశాఖలో తారాతోరణం కనిపించి కనువిందు చేస్తుందన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: